టాటా ఓపెన్ డ‌బుల్స్ టైటిల్ నెగ్గిన బోప‌న్న జోడీ

-

మ‌న దేశంలో జ‌రుగుతున్న టాటా ఓపెన్ టెన్నిస్ టోర్నీ డ‌బుల్స్ టైటిల్ ను బోప‌న్న జోడీ కైవసం చేసుకుంది. ఆదివారం పూణేలో జ‌రిగిన ఫైన‌ల్ మ్యాచ్ లో రోహన్ బోప‌న్న – రామ్ కుమార్ రామ‌నాథ‌న్ విజ‌యం సాధించారు. దీంతో రోహ‌న్ బోప‌న్న త‌న కేరీర్ లో 21వ ఏటీపీ డ‌బుల్స్ టైటిల్ ను సొంతం చేసుకున్నాడు. అలాగే రామ్ కుమార్ త‌న కేరీర్ లో రెండో టైటిల్ ను అందుకున్నారు. కాగ బోప‌న్న – రామ్ కుమార్ ఇటీవ‌ల జ‌రిగిన ఆడీలైడ్ ఓపెన్ లో జోడీ క‌ట్టారు.

ఈ ఆడీలైడ్ టోర్నీలో ర‌న్న‌ర్ అప్ గా నిలిచారు. తాజాగా టాటా ఓపెన్ ఫైన‌ల్ లో నెగ్గి టైటిల్ ను సొంతం చేసుకున్నారు. కాగ టాటా ఓపెన్ డ‌బుల్స్ ఫైన‌ల్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా కు చెందిన ల్యూక్ సావిల్లే – జాక్ ప్యాట్రిక్ ల‌పై 6-7 (10-12), 6-3, 10-6 తేడాతో విజ‌యం సాధించారు. తొలి సెట్ లో టై బ్రేక్ అయింది. అయినా.. గట్టి పోటీని ఇచ్చారు. కానీ తొలి సెట్ కోల్పోయింది. కానీ త‌ర్వాత వ‌రుస‌గా రెండు సెట్ల ను బోపన్న జోడీ కైవసం చేసుకుని టైటిల్ ను లిఫ్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version