ఏపీలో ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం లేదు : బొత్స

-

ఏపీలో ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం లేదన్నారు ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్య నారాయణ. జీవో నంబరు 1ను విపక్షాలు చదివాయా అని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. జీవోలో రోడ్ షోలు, ర్యాలీలు నిషేధమని ఎక్కడుందని నిలదీశారు. రోడ్లపై బహిరంగ సభలు పెట్టవద్దని మాత్రమే చెప్పామన్నారు. అవసరమైతే అనుమతి తీసుకోని బహిరంగ సభలు పెట్టుకోవచ్చని తెలిపారు.

జీవో నంబర్ 1 అన్ని పార్టీలకు వర్తిస్తుందన్నారు. వైయస్సార్, జగన్ ఎన్నో పాదయాత్రల్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నామని వివరించారు. చంద్రబాబు ఐడియాలజీలను పవన్ వెల్లడిస్తుంటాడని.. అంతకు మించి పవన్ ఏం చేస్తాడు? అని ఆగ్రహించారు. లోకేష్ పాదయాత్ర వలన ప్రజలకు ఏం ఉపయోగం ఉంటుంది? జగన్ తెచ్చిన ప్రతి పథకమూ పేదలందరికీ ఉపయోగపడేలా చేశాడన్నారు. చంద్రబాబు మోసం, కుట్ర, దగా తప్ప మరేం చేశారు? లోకేష్ కూడా అలాంటి వ్యక్తే అని చురకలు అంటించారు మంత్రి బొత్స సత్య నారాయణ.

Read more RELATED
Recommended to you

Latest news