కావాలనే నన్ను టార్గెట్ చేశారు – మంత్రి పెద్దిరెడ్డి

-

టిడిపి అధినేత చంద్రబాబు తనని కావాలనే టార్గెట్ చేస్తున్నారని ఆరోపించారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. రాజకీయాలలో ఎంత మంచి చేసినా చెడుగా చిత్రీకరించి విమర్శించేవారు చాలామంది ఉంటారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి కి టూరు జిల్లా ప్రశాంతంగా ఉంటే అక్కడికి వచ్చి అల్లర్లు సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు వ్యాఖ్యలు రెచ్చగొట్టేలా ఉన్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి.

సీఎం జగన్ అద్భుతమైన పాలన అందిస్తున్నారని చెప్పుకొచ్చారు. కుప్పం నియోజకవర్గంలో మూడు రోజులు పర్యటించిన చంద్రబాబు మంత్రి పెద్దిరెడ్డి పై తీవ్ర విమర్శలు గుప్పించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో శనివారం పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలో పల్లెబాట కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి ఈ వ్యాఖ్యలు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news