బ్రేకింగ్: ప్రకాశం జిల్లాలో శానిటైజర్ తాగి 8 మంది మృతి

-

లాక్ డౌన్ లో మద్యం లేక శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు ఇటీవల వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లా కురుచేడులో 8 మంది శానిటైజర్ తాగి ప్రాణాలు కోల్పోయారు. కురిచేడు ఘటనలో నిన్న నలుగురు ప్రాణాలు కోల్పోగా మృతుల సంఖ్య నేడు 8 కి చేరుకుంది. కరోనా దృష్ట్యా కురిచేడులో పది రోజులుగా మద్యం దుకాణాలు మూతపడ్డాయి.

అక్కడ లాక్ డౌన్ ని కఠినం గా అమలు చేస్తున్నారు. మద్యం దుకాణాలు లేకపోవడంతో కొంతమంది స్థానికులు, యాచకులు శానిటైజర్‌ తాగారని అక్కడి అధికారులు పేర్కొన్నారు. గురువారం అర్థరాత్రి ముగ్గురు మరణించగా.. ఇవాళ తాజాగా మరో నలుగురు మృతి చెందారట. ఈ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం నివేదిక కోరింది. దీనిపై జిల్లా కలెక్టర్ ని సిఎం జగన్ నివేదిక కోరినట్టు వార్తలు వస్తున్నాయి.

Read more RELATED
Recommended to you

Latest news