ప్రణబ్ మృతి’, మా నాన్న బ్రతికే ఉన్నారు అది తప్పుడు ప్రచారం…!

-

భారత మాజీ రాష్ట్రపతి కాంగ్రెస్ సీనియర్ నేత ప్రణబ్ ముఖర్జీ కరోనా బారిన పడి ప్రాణాలు కోల్పోయారు అని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై ఆయన కుమారుడు అబిజిత్ ముఖర్జీ స్పందించారు. తన తండ్రి ఇంకా బ్రతికే ఉన్నారు అని ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని అన్నారు. సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని అది నిజం కాదని అన్నారు.

భారత్ లో మీడియా ఫేక్ న్యూస్ కి ఫ్యాక్టరీ గా మారిపోయింది అని ఆయన మండిపడ్డారు. సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి కాబట్టి తాను స్పందించా అని ఆయన స్పష్టం చేసారు. కాగా ప్రణబ్ ఆరోగ్య౦ గత నాలుగు రోజులుగా విషమంగా ఉంది. ఆయనకు మెదడులో రక్తం గడ్డ కట్టింది. దీనితో ఆపరేషన్ కూడా నిర్వహించారు.

Read more RELATED
Recommended to you

Latest news