బ్రేకింగ్: ఢిల్లీకి పొంచి ఉన్న ముప్పు

-

పొరుగు రాష్ట్రాల్లో పొలాలను తగలబెట్టడంతో దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత తగ్గే అవకాశం ఉందని అక్కడి ప్రభుత్వం పేర్కొంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ గాలి నాణ్యత మరింత దిగజారిపోయే అవకాశం ఉందని హెచ్చరించింది. గాలి కాలుష్యంలో పీఎం 2.5 పెరుగుతుందని పేర్కొంది. గాలి నాణ్యతను క్షీణింపజేసే అవకాశం ఉందని పేర్కొంది. పీఎం 2.5 అనేది 2.5 మైక్రాన్ల కంటే తక్కువ వ్యాసం కలిగిన చిన్న రేణువు.

ఊపిరితిత్తులలోకి మరియు రక్తప్రవాహంలోకి కూడా ప్రవేశిస్తుందని హెచ్చరించింది. ఢిల్లీ గాలి నాణ్యత బుధవారం మరియు గురువారం “మోడరేట్” విభాగంలోనే ఉంటుందని, అయితే రాబోయే రోజుల్లో అది క్షీణించే అవకాశం ఉందని భూమి శాస్త్ర మంత్రిత్వ శాఖ యొక్క ఎయిర్ క్వాలిటీ మానిటర్ విభాగం పేర్కొంది. పంజాబ్, హర్యానా మరియు పొరుగు సరిహద్దు ప్రాంతాల నుంచి పంట పొలాలను భారీగా కాల్చేస్తున్నారు అని ఆ ప్రభావం ఇక్కడ పడుతుంది అని పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version