బ్రేకింగ్: వైసీపీ సీనియర్ నేత, బొత్స రాజకీయ గురువు మృతి

-

మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత పెన్మత్స సాంబ శివరాజు అనారోగ్యంతో కన్ను మూశారు. గత కొన్ని రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం నేడు విషమించింది. ఆయన విశాఖలో ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం ఉదయం కన్నుమూసారు అని ఆయన కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయనకు సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉంది. మంత్రి బొత్స సత్యనారాయణ కు రాజకీయ గురువుగా ఉన్నారు.

ఆయన రెండు సార్లు మంత్రిగా పని చేయడమే కాకుండా 8 సార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు. బొత్స సత్యనారాయణ విజయనగరంలో బలమైన నేతగా ఎదగడానికి గానూ ఆయన నుంచి అందిన సహకారమే అని జిల్లా నేతలు చెప్తూ ఉంటారు. వయసు మీద పడినా సరే గత ఎన్నికల్లో వైసీపీ విజయానికి ఆయన జిల్లాల్లో తన వంతుగా కృషి చేసారు. పార్టీకి అన్నీ తానై వ్యవహరించారు.

Read more RELATED
Recommended to you

Latest news