ఈ తాగుబోతు నాకొద్దు..! పిండ్లి పీటలపై అడ్డం తిరిగిన యువతి!

-

పెండ్లి వేడుక మొదలైంది! పెండ్లి కూతురు, పెండ్లి కొడుకు వేదికపైకి వచ్చారు! ఇద్దరి తరఫు బంధువులు పెండ్లి మండపంలో ఆసీనులై వేడుకను ఆసక్తిగా తిలకిస్తున్నారు! సరిగ్గా అప్పుడే కథ అడ్డం తిరిగింది. ‘ఈ తాగుబోతు నాకొద్దు’ అని గట్టిగా అరుస్తూ పెండ్లి కూతురు లేచి నిలబడింది. అప్పటికే తన్నుకొస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేక ఏడుస్తూ వేదిక దిగి వెళ్లిపోయింది. దీంతో పీటలమీదే పెండ్లి ఆగిపోయింది.

పెండ్లికి వచ్చిన బంధు, మిత్రులతోపాటు అందరినీ హతాశులను చేసిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రం, మీరట్‌ నగరంలో జరిగింది. అసలేం జరిగిందంటే.. పీటలమీద కూర్చున్న పెండ్లి కొడుకు నోటి నుంచి గుప్పుమని మద్యం వాసన రావడంతో పెండ్లి కూతురు హతాశురాలైంది. సరిగా కూర్చోలేక జోగుతున్న పెండ్లి కొడుకు వాలకం చూసి ఆమెకు ఒళ్లు మండిపోయింది. అందుకే కోపంతో పీటల మీది నుంచి లేచి వెళ్లిపోయింది.

ఇక, మరో ఇంట్రెస్టింగ్‌ విషయం ఏందంటే.. పెండ్లి కొడుకు తల్లి, తండ్రి కూడా పూటుగా మద్యం తాగి, పెండ్లి కూతురు కుటుంబసభ్యులను ఓ గదిలో నిర్బంధించారు. పెండ్లి జరుగకుండా ఎవ్వరినీ ఇక్కడి నుంచి వెళ్లనిచ్చేది లేదంటూ హంగామా చేశారు. అయితే, ఇంతలో సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు.. ఘటనా ప్రాంతానికి చేరుకుని పెండ్లి కూతరు తరఫువారిని విడిపించారు. పెండ్లికూతురు కుటుంబం ఫిర్యాదు మేరకు.. పెండ్లి కొడుకును, అతని తల్లిదండ్రులను అదుపులోకి తీసుకున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news