BRS బిగ్ షాక్… కాళేశ్వరంపై హైకోర్టు కీలక ప్రకటన చేసింది. కాళేశ్వరంపై రేపు హైకోర్టులో విచారణ చేయనుంది. కాళేశ్వరం ప్రాజెక్టు నివేదికపై హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసారు హరీశ్ రావు. అయితే ఆ లంచ్ మోషన్ పిటిషన్ను నిరాకరించిన హైకోర్టు…రేపు విచారణ చేపడతామని ప్రకటన చేసింది.

ఇది ఇలా ఉండగా, కాళేశ్వరం కేసును సీబీఐకి అప్పగించాలని నిర్ణయించిన సీఎం రేవంత్ రెడ్డి… ఈ మేరకు అసెంబ్లీ లో ప్రకటించారు. పీసీ ఘోష్ కమిషన్ రిపోర్టుపై మీరు సజెషన్స్ ఇవ్వండి.. డెసిషన్స్ అవసరం లేదని వెల్లడించారు. నేను హౌస్ లీడర్ని.. నేను డెసిషన్స్ తీసుకుంటానని ప్రకటించారు.
నాకు హౌస్ ఎలా రన్ చేయాలో తెలుసు.. మీరు సజెషన్స్ ఇస్తే ఇవ్వండి, లేదంటే లేదు అని చెప్పారు రేవంత్ రెడ్డి. మోడీ మన బిగ్ బ్రదర్…. ఈ దేశంలో ప్రధానమంత్రి ప్రతి ముఖ్యమంత్రికి బడా బాయ్ అవుతాడని మరోసారి మోడీని మెచ్చుకున్నారు.