కరీంనగర్‌లో దారుణ హత్య.. ఇనుప రాడ్డుతో మోది!

-

కరీంనగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు సోదరుల మధ్య వివాదం కాస్త ముదిరి ప్రాణాలు తీసే వరకు వెళ్లింది. అర్దరాత్రి ఇద్దరు సోదరుల మధ్య గొడవ జరగడంతో అది కాస్త ఘర్షణగా మారింది. ఈ క్రమంలో తన సోదరుడిని ఇనుపరాడ్డుతో తలపై మోదగా వ్యక్తి మృతి చెందాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల కథనం ప్రకారం..

సైదాపూర్ మండలం దుద్దెనపల్లి గ్రామానికి కుందేళ్ల చంద్రు(24) తన సోదరుడు కుమారస్వామి చేతిలో హత్యకు గురయ్యాడు. అయితే, ఇద్దరు సోదరుల మధ్య అర్ధరాత్రి ఘర్షణ జరిగింది. అది కాస్త తీవ్ర ఘర్షణకు దారి తీసింది. దీంతో సహనం కోల్పోయిన కుమారస్వామి తన సోదరుడు చంద్రును ఇనుప రాడ్ కొట్టడంతో తలపై బలంగా మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావం జరిగి స్పాట్‌లోనే చంద్రు మృతి చెందాడు.స్థానికుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు గల కారణాలపై ఆరా తీశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Read more RELATED
Recommended to you

Latest news