సంగారెడ్డిలో దారుణ హ‌త్య‌.. వేర్వేరు మండ‌లాల్లో త‌ల‌, మొండెం

-

తెలంగాణ‌లోని సంగారెడ్డి జిల్లాలో దారుణ హ‌త్య జ‌రిగింది. ఒక వ్య‌క్తిని దుండ‌గులు అతి కిరాతంగా హ‌త్య చేసి త‌ల, మొండెం ల‌ను వేరి చేసి వేర్వేరు మండ‌లాల్లో ప‌డేసారు. కాగ జిల్లాలోని రామ‌చంద్రాపూరం మండ‌లంలోని వెలిమెల తండా కు చెందిన క‌డ‌వ‌త్ రాజు రియ‌ల్ ఎస్టెట్ వ్యాపారం చేస్తున్నాడు. అయితే ఈ నెల 26న రాజు ఒక ఫోన్ రావ‌డంతో వెళ్లాడు. అప్పటి నుంచి రాజు ఆచూకీ తెల‌య‌లేదు. దీంతో 26 వ తేదీ రోజునే రాజు సోద‌రుడు గోపాలు భానూర్ పోలీసుల‌కు ఫీర్యాదు చేశారు.

పోలీసులు కేసు న‌మోదు చేసుకుని దర్య‌ప్తు చేప‌ట్టారు. అయితే శ‌నివారం రాయికోడ్ పోలీస్ స్టేషన్ ప‌రిధిలో కుసునూరు వాడులో ఒక త‌ల ల‌భ్యం అయింది. త‌ల ఎవ‌రిది అని విచారించాగా.. రాజు త‌ల అని తెలింది. అలాగే రాజు మొండెం మానూర్ మండ‌ల ప‌రిధిలో గ‌ల సింగూర్ బ్యాక్ వాట‌ర్ లో ల‌భ్య‌మైంది. అయితే రాజు త‌ల, మొండెం ను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసును ద‌ర్యాప్తు చేస్తున్నారు. కగా రాజు ఆర్థికంగా, రాజ‌కీయం గా ఎదుగ‌డంతో ఈర్షతో హ‌త్య చేసి ఉంటార‌ని పోలీసులు అనుమానిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news