సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి దారుణ హత్య

-

సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. జిల్లాలోని కల్హేర్ మండల కేంద్రం కొత్తచెరువు తండాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకుడు హరిసింగ్‌ను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు.

ఈ ఘటనపై నారాయణఖేడ్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి స్పందిస్తూ.. హరిసింగ్ బీఆర్ఎస్ పార్టీ కోసం చాలా కష్టపడ్డాడని,రాజకీయ కక్షతోనే అతన్ని హత్య చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి నియోజకవర్గంలో అనేక రాజకీయ హత్యలు జరుగుతున్నాయని, హరిసింగ్ హత్యకు కారణమైన వారిని వెంటనే శిక్షించాలని మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version