జగన్ గారిది బిజినెస్ మైండ్ కాదు క్రిమినల్ మైండ్: బుద్ధా వెంకన్న

-

మద్యం ధరలను పెంచేస్తూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై వస్తున్న విమర్శలకు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి స్పందిన సంగ‌తి తెలిసిందే. మద్యం ధరలు పెంచినా ఆదాయం ఎందుకు పెరగడం లేదని చంద్రబాబు గోల పెడుతున్నాడు. బిజినెస్ మైండ్ కదా? ప్రతిదీ లాభనష్టాల కోణంలోనే చూస్తారు అంటూ చంద్ర‌బాబుకు చుర‌క వేశారు విజ‌య్ సాయిరెడ్డి. అయితే తాజాగా దీనికి కౌంట‌ర్ ఇచ్చారు బుద్ధా వెంక‌న్న. `విజయసాయిరెడ్డి గారు మీ ప్రతాపం ట్విట్టర్ లో కాదు.. మద్యం దుకాణం ముందు నిలబడి చూపించండి. మద్యపాన నిషేధం పేరుతో కోట్లు కొల్లగొడుతున్న జగన్ గారిది బిజినెస్ మైండ్ కాదు క్రిమినల్ మైండ్’ అని బుద్ధా వెంకన్న ట్వీట్ చేశారు.

‘ప్రభుత్వ మద్యం దుకాణాల పేరుతో బ్రాండ్ల దందా మొదలు పెట్టిన మీరు మద్యపాన నిషేధం గురించి మాట్లాడుతున్నారా? సిగ్గుగా లేదా? మద్యపాన నిషేధం అమలై అందరూ తాగడం మానేశారు అని డప్పు కొడుతున్నారు. మరి మద్యం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం ఎలా పెరుగుతుంది సాయిరెడ్డి గారు?’ అని ప్రశ్నించారు. ‘తప్పుడు లెక్కలు రాసే మీరే ఈ లాజిక్ వెనుక ఉన్న మ్యాజిక్ ఏంటో చెప్పాలి. జగన్ గారికి, మీకు డబ్బు పిచ్చి పోగొట్టేలా మనీ డీ-అడిక్షన్ సెంటర్లు పెట్టించుకోండి కాస్త ఉపయోగం ఉంటుంది’ అని బుద్ధా వెంకన్న కౌంటర్ ఇచ్చారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version