ఏపీ, తెలంగాణకు ఇప్పట్లో బుల్లెట్ రైల్ లేనట్టే- దక్షిణ మధ్య రైల్వే జీఎం

-

తెలుగు ప్రజల బుల్లెట్ ట్రైన్ కల ఇప్పట్లో నెరవేరేలా లేదు. ఇటీవల కేంద్రం హైదరాబాద్- ముంబై మధ్య బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ మొదలవుతుందని భావించినప్పటికీ అది ముందుకు పోయే పరిస్థితి లేదు. తాజాగా దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన్ మాల్యా బుల్లెట్ రైల్ ప్రాజెక్ట్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతానికి తెలుగు రాష్ట్రాలకు బుల్లెట్ రైల్ లేనట్లే అనే విషయాన్ని స్పష్టం చేశారు. ప్రస్తుతం చేపట్టిన అహ్మదాబాద్- ముంబై బుల్లెట్ రైల్ సక్సెస్ పై మిగతా ప్రాజెక్ట్ లు ఆధారపడి ఉన్నాయన్నారు. మరోవైపు ఖాజీపేట కోచ్ ప్యాక్టరీపై కూడా కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖాజీపేట కోచ్ ప్యాక్టరీ కూడా కష్టమే అని ఆయన వ్యాఖ్యానించారు. కోచ్ ప్యాక్టరీ అవసరం లేదని రైల్వే శాఖ భావిస్తుందని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిధుల ఇవ్వడంలో కొన్ని ప్రాజెక్ట్ లు ఆలస్యమవుతున్నాయని ఆయన అన్నారు. ఎంఎంటీఎస్ రైళ్లను ప్రత్యేక పట్టాలపై నడపడం సాధ్యం కాదని ఆయన అన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version