పూజల పేరుతో వివాహితకు తాళి కట్టిన బురిడీ బాబా.. చివరికి..?

-

ఈ మధ్యకాలంలో ఎక్కడ చూసినా దొంగ బాబాల బెడద ఎక్కువైపోతున్న విషయం తెలిసిందే. ప్రజల నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని మాయమాటలు చెప్పి దారుణాలకు పాల్పడుతున్నారు బురిడీ బాబాలు. ఇక్కడ ఓ బురిడీ బాబా యవ్వారం బయటపడింది. పూజలు చేయకుంటే భర్త ప్రాణాలకు ప్రమాదం అంటూ చెప్పి ఓ వివాహిత మెడలో తాళి కట్టాడు ఇక్కడొక బాబా . అంతేకాదు వివాహితను బెదిరింపులకి పాల్పడి వేధించడం మొదలుపెట్టాడు.

చివరికి బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం బయటపడింది. ఇటీవలే హైదరాబాద్ నగరంలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. కే పి హెచ్ బిలో ఉండే మహిళకు మాధవ్ అనే బురిడి బాబా పరిచయమయ్యాడు. భర్త జాతకంలో దోషం ఉందని పూజలు చేయకపోతే ప్రాణాపాయం ఉంది అంటూ నమ్మించాడు. భర్త లేని సమయంలో పూజలు చేయాలి అంటూ నమ్మించి పూజల పేరుతో వివాహిత మెడలో తాళి కట్టాడు. ఆ తర్వాత నేనే నీ భర్తను అంటూ బెదిరింపులకు దిగాడు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించగా రంగంలోకి దిగిన పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news