టీడీపీ నుంచి వైసీపీలోకి.. మరో నలుగురు రెడీగా ఉన్నారు..?

-

ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో రోజురోజుకీ పరిణామాలు మారిపోతున్నాయి. ప్రతిపక్ష టిడిపి పార్టీ నుంచి అధికార వైసీపీ పార్టీలోకి రోజురోజుకు వలసల పర్వం ఎక్కువవుతుంది. ఇప్పటికే కీలక నేతలు టిడిపిని వదిలి వైసీపీ వైపు నడిచి చంద్రబాబుకు షాక్ ఇవ్వగా ఇటీవలే విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కూడా వైసీపీ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేతలు అందరూ వైసీపీలోకి వెళ్లిన గణేష్ పై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అతని పై అనర్హత వేటు కూడా వేస్తాం అంటూ విమర్శలు చేస్తున్నారు.

ఇలాంటి పరిణామాల నేపథ్యంలో తాజాగా తనపై వస్తున్న విమర్శలపై స్పందించిన విశాఖ సౌత్ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. తనపై తెలుగుదేశం పార్టీ అనర్హత వేటు వేస్తే రాజీనామాలకు సిద్ధంగా ఉన్నాను అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనతో పాటు మరో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా రాజీనామాకు సిద్ధం గా వున్నారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసిన గణేష్.. జగన్ టికెట్ ఇస్తే అందరం కలిసి మళ్లీ పోటీ చేసి తాడో పేడో తేల్చుకుంటాం అంటూ వ్యాఖ్యానించారు. టిడిపిలో ఉన్న 16 నెలల పాటు నిద్ర లేని రాత్రులు గడిపాను అంటూ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ వ్యాఖ్యానించారు.

Read more RELATED
Recommended to you

Latest news