దారుణం : కరెంట్ తీగలు తగిలి కాలిపోయిన బస్.. ముగ్గురు మృతి

-

ఢిల్లీ నుంచి జైపూర్ వెళ్తున్న ప్రైవేటు బస్సుకు హైటెన్షన్ విద్యుత్ తీగ తగలగా మంటలు చెలరేగి ముగ్గురు వ్యక్తులు అక్కడిక్కడే మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. లాబానా గ్రామ సమీపంలో ఒక ట్రక్కు బోల్తా పడటంతో జైపూర్-ఢిల్లీ జాతీయ రహదారి మీద భారీ ట్రాఫిక్ జాం ఏర్పడింది. ఈ కారణంగా, ఒక ప్రైవేటు బస్సు డ్రైవర్ తన వాహనాన్ని రాంగ్ రూట్ లో తీసుకెళ్లడానికి ప్రయత్నించాడు.

ఈ క్రమంలో ఈ బస్సు హైటెన్షన్ విద్యుత్‌ లైన్‌ కు తగలగా మంటలు చెలరేగినట్లు స్థానిక పోలీసు అధికారి అనితా మీనా తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు మరణించగా, మరో ఆరుగురు గాయపడ్డారు. బస్సులోని ఇతర ప్రయాణికులను సురక్షితంగా హాస్పిటల్ కి తరలించినట్లు అనితా మీనా తెలిపారు. క్షతగాత్రులను నిమ్స్ ఆసుపత్రిలో చేర్పించినట్లు ఆమె తెలిపారు. మంటల్లో బస్సు పూర్తిగా ధ్వంసమైందని అనితా మీనా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news