చిత్తూరులో బస్సు బోల్తా.. 22 మందికి గాయాలు

-

ఏపీలో ఘోర  చిత్తూరు జిల్లాలో ప్రైవేట్ బస్సు బోల్తాపడింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుడిపాల మండలం గొల్లమడుగు మలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… పుదుచ్చేరి నుంచి హైదరాబాద్ వెళుతున్న ఓ ప్రైవేట్ బస్సు గుడిపాల మండలంలోని చిత్తూరు – వేలూరు జాతీయ రహదారిపై గొల్లమడుగు మలుపు వద్ద అదుపు తప్పింది.

Bus overturns in Chittoor 22 injured

ఈ క్రమంలో గోడను ఢీ కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సికింద్రాబాద్ కు చెందిన లలిత (65) తమిళనాడులోని మాని యంబాడికి చెందిన కుబేరన్ (35) తీవ్రంగా… మరో 20 మంది స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలికి చేరుకొని పరిశీలించారు. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో బస్సులో మొత్తం 33 మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version