పల్టీలు కొడుతూ లోయలో పడ్డ బస్సు.. 16 మంది దుర్మరణం

-

నేపాల్ లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. లోయలో బస్సు పడి 16 మంది ప్రయాణికులు దుర్మరణం పాలయ్యారు. నేపాల్ లోని అర్ఘకాచి జిల్లాలోని సింధికార్క నుంచి రూపందేహీ జిల్లా కేంద్రానికి బయలుదేరిన బస్సు మార్గమధ్యలో ప్రమాదానికి గురైంది. నిన్న సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాద సమయంలో బస్సులో 23 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 16 మంది ప్రయాణికులు అక్కడిక్కడే మృతిచెందగా, మిగిలిన వారంతా గాయాల పాలయ్యారు.

క్షతగాత్రులను చికిత్స నిమిత్తం స్థానిక ఆస్పత్రికి తరలించారు. స‌మాచారం ప్ర‌కారం.. ఘాట్ రోడ్డులో బయలు దేరిన బస్సు మార్గమధ్యలో అదుపుతప్పింది. బస్సును కంట్రోల్ చేయడంలో డ్రైవర్ విఫలం కావడంతో లోయలోకి బస్సు దూసుకు పోవడమేకాక బోల్తా కొట్టింది. దీంతో బస్సు ప్రయాణికుల్లో అత్యధికులు అక్కడికక్కడే చనిపోయారు.

 

Read more RELATED
Recommended to you

Latest news