సంచలన నిర్ణయం: రూ. 600 కోట్లు వదిలి సన్యాసిగా మారిన వ్యాపారి !

-

డబ్బులు సంపాదించడం అంటే ఎంత కష్టమైన పనో తెలిసిందే. కానీ రాజస్థాన్ కు చెందిన ఒక వ్యాపారస్థుడు రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎంతో కష్టపడి కొన్ని సంవత్సరాల పాటు రూపాయి రూపాయి కూడబెట్టి రూ. 600 కోట్ల రూపాయలను సంపాదించాడు. అయితే మనిషి నిజమైన జీవితాన్ని కళ్లారా చూస్తూ ఇతనికి అసహ్యం వేసింది. ఈ లోకంలో మనిషి కన్నా మనము సంపాదించే డబ్బుకు ఎక్కువ విలువని తెలుసుకున్న భన్వర్ లాల్ రఘునాధ్ జోషి ఒక కీలక నిర్ణయం తీసుకున్నాడు ఆ బిలియనీర్. తన సంపాదనను అంతా వదిలేసి జైనమతంలోకి వెళ్లిపోయాడు. ఈ మధ్యనే అహమ్మదాబాద్ లో జరిగిన ఒక వేడుకలో తన గురువు శ్రీ సురస్వరాజ్ జీ నుండి శిష్యరికాన్ని తీసుకున్నారు. ఇతను ప్లాస్టిక్ వ్యాపారం చేసి సంపాదించిన సొమ్మును అంతా అలాగే వదిలేసి జైనమతాన్ని స్వీకరించాడు. ఈ వార్త తెలిసిన వారు అంతా కూడా షాక్ కు గురవుతున్నారు.

మరి ఆ డబ్బు అంతా ఎవరికీ చెందుతుంది ? సడెన్ గా ఈ నిర్ణయం తీసుకోవడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా ? అన్నది తెలియాల్సి ఉంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version