C.B.I :మీరు ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ చేస్తాం: హైకోర్టులో సీబీఐ

-

కెసిఆర్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు లో జరిగిన అవినీతిపై దర్యాప్తు చేపడతామని హైకోర్టులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ పేర్కొంది. ఈ ప్రాజెక్టుపై దర్యాప్తుపై సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. కాళేశ్వరం మేడిగడ్డ పిల్లర్ కుంగిన ఘటనపై సీబీఐతో విచారణ జరిపించాలని కాంగ్రెస్ నేత నిరంజన్ అసెంబ్లీ ఎన్నికల ముందు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఇందులో రాష్ట్ర ప్రభుత్వం, సీబీఐని ప్రతివాదులుగా పిటిషనర్ నిరంజన్ పేర్కొన్నారు. ఈ పిటిషన్ ను స్వీకరించిన హైకోర్టు.. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని సీబీఐకి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమంలో ఫిబ్రవరి 2న హైకోర్టు మరోసారి విచారణ జరపనుంది.

హైకోర్టుగానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ఆదేశిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాలపై దర్యాప్తుకు సిద్ధంగా ఉన్నామన్న సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది… దర్యాప్తునకు అవసరమైన సౌకర్యాలు, వనరులు ప్రభుత్వం కల్పించాలని కోరింది. అడిషనల్ ఎస్సీ, ముగ్గురు డీఎస్పీలు, ఆరుగురు ఇన్ స్పెక్టర్లు, నలుగురు ఎస్సైలతోపాటు సిబ్బంది కావాలని సీబీఐ అధికారులు కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news