అదిరే స్కీమ్.. రూ.5 లక్షలు పెట్టండి.. గ్యారంటీగా రూ.10 లక్షలు.. !

-

చాలా మంది ఈ మధ్య కాలం లో ఎన్నో రకాల స్కీముల్లో డబ్బులు పెడుతున్నారు. ఇలా ఇన్వెస్ట్ చేస్తే చాలా మందికి చక్కటి లాభాలు కలుగుతాయి. కొన్ని పథకాల వలన రెట్టింపు లాభాలు కూడా పొందొచ్చు. మీరు మీ ఇంట్లో ఉన్న డబ్బును రెట్టింపు చేసుకోవాలని చూస్తున్నారా..? అయితే గుడ్ న్యూస్. పోస్టాఫీస్‌లో కిసాన్ వికాస్ పత్ర పేరుతో ఒక పథకం వుంది. పోస్టాఫీస్‌ కిసాన్ వికాస్ పత్ర స్కీము వలన ఎలాంటి రిస్క్ ఉండదు. పైగా డబ్బులు రెట్టింపు అవుతాయి. రాబడి సొంతం చేసుకోవచ్చు.

కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్ 1 నుంచి ఈ స్కీము వడ్డీ ని పెంచింది. ఈ స్కీము లో ఇన్వెస్ట్ చేస్తే ఇది వరకు కన్నా అధిక రాబడి పొందొచ్చు. ప్రస్తుతం ఈ స్కీము పైన 7.5 శాతం వడ్డీ లభిస్తోంది. 7.2 శాతం వడ్డీ వస్తోంది. కిసాన్ వికాస్ పత్ర వన్ టైమ్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్ ఏ. అంటే ఈ స్కీమ్‌ లో ఒకసారి డబ్బులు పెడితే చాలు. రూ. 1000 ఇన్వెస్ట్‌మెంట్‌తో మీరు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. ఈ స్కీము లో మీరు ఎంత మొత్తాన్ని అయినా సరే ఇన్వెస్ట్ చేయొచ్చు. 115 నెలల్లో డబ్బులు డబుల్ అవుతాయి.

9 ఏళ్ల 7 నెలలు ఉండాలి. ఇది వరకు డబ్బు రెట్టింపుకు 120 నెలలు ఆగాల్సి ఉండేది. ఈ స్కీమ్‌లో రూ. 5 లక్షలు పెడితే రూ. 10 లక్షలు వస్తాయి. రిస్క్ ఉండదు. ఈ స్కీమ్ లో మీరు సింగల్ గా కానీ లేదంటే జాయింట్ గా కానీ అకౌంట్ ని ఓపెన్ చేసేయచ్చు. నామినీ ఫెసిలిటీ కూడా ఉంది. పదేళ్లకు పైన వయసు కలిగి ఉంటే ఈ స్కీము లో చేరవచ్చు. గార్డియన్ అవసరం అవుతుంది. ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత మళ్లీ డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే కనీసం 2 ఏళ్ల ఆరు నెలలు ఆగాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version