IND VS WI: హార్దిక్ పాండ్య కెప్టెన్సీ చూసుకో … ఇది గెలిస్తేనే!

-

ఈ రోజు రాత్రి 8 గంటలకు ఇండియా మరియు వెస్ట్ ఇండీస్ ల మధ్యన మూడవ టీ 20 మ్యాచ్ జరగనుంది. మొదటి రెండు మ్యాచ్ లను చేజార్చుకున్న ఇండియా సిరీస్ ను నిలబెట్టుకోవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్ లో ఒత్తిడితో బరిలోకి దిగనుంది. గత మ్యాచ్ లో ఓటమికి బ్యాట్సమన్ మరియు బౌలర్లు ఇద్దరూ కారణం అయ్యారు. మొదట బ్యాటింగ్ చేసిన ఇండియా కేవలం 152 పరుగులకే పరిమితం కాగా, గిల్ , సూర్య మరియు శాంసన్ లు దారుణంగా ఫెయిల్ అయ్యారు. ఇక కెప్టెన్ హార్దిక్ పాండ్య కూడా కీలక సమయంలో అవుట్ అవ్వడంతో జట్టుకు మరో 20 పరుగులు రాకుండా పోయాయి. బౌలింగ్ లోనూ చాహల్ పాండ్య మినహా ఎవ్వరూ మ్యాచ్ ను గెలిపించే ప్రదర్శన అయితే చేయలేదు.

ఈ రోజు సిరీస్ కోసం చావో రేవో మ్యాచ్ కావడం వలన కెప్టెన్ పైన తీవ్ర ఒత్తిడి పడనుంది. మరి ఈ రోజు మ్యాచ్ లో జట్టులో చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్న జట్టుతో ఎలా మ్యాచ్ ను గెలిపిస్తాడు అన్నది చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news