మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌పై కేసు నమోదు

-

టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీ ప్రసాద్‌పై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసు స్టేషన్‌లో కేసు నమోదైంది. కరాటే కల్యాణి, పలు హిందూ సంఘాలు చేసిన ఫిర్యాదుతో డీఎస్పీపై కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఏసీపీ ప్రసాద్ తెలిపారు. ‘ఓ పరి’ అనే ప్రేవేట్ ఆల్బమ్‌లో “హరే రామ – హరే కృష్ణ” మంత్రంపై అశ్లీల నృత్యాలు చేశారని హిందు సంఘాలు, కరాటే కల్యాణి రెండు రోజుల క్రితం ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. హిందువుల మనోభావాలను దేవి దెబ్బతీయడానికి చూస్తున్నాడని కరాటే కల్యాణి ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై న్యాయ సలహాలు తీసుకొని తదుపరి చర్యలు తీసుకుంటామని ఏసీపీ స్పష్టం చేశారు.

దేవీ శ్రీ ప్రసాద్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కరలేదు. టాలీవుడ్‌లో బిజీ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడు. ఈ రాక్ స్టార్ కంపోజ్ చేసిన నాన్‌-ఫిల్మ్ మ్యూజిక్ వీడియో ‘ఓ ప‌రి’ సాంగ్. ఈ పాట‌ను దేవీ శ్రీ ప్ర‌సాద్ కంపోజ్ చేయ‌డ‌మే కాకుండా స్వ‌యంగా పాడాడు. పాన్ ఇండియా మ్యూజిక్ ల‌వ‌ర్స్‌ను ఆకట్టుకునేలా పాట కంపోజ్ చేశాడు. ఈ పాట తెలుగులో ‘ఓ పిల్లా’ పేరుతో రిలీజ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news