విజయసాయి రెడ్డి పై మహిళా నేత కంప్లైంట్..!

-

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి మీద మహిళ నేత కంప్లైంట్ చేశారు వివరాల్లోకి వెళ్తే రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూల్చేందుకు ప్రయత్నిస్తున్నారని కాల్వ సుజాత జూబ్లీహిల్స్ పోలీసులకి విజయ్ సాయి రెడ్డి పై ఫిర్యాదు చేశారు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మూడు నెలలు కూలిపోతుందని రాజ్యసభ సాక్షిగా చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని పిటిషన్ లో కోరారు. కాల్వ సుజాత ఫిర్యాదు మేరకు పోలీసులు విజయ్ సాయి రెడ్డి మీద కేసును నమోదు చేశారు.

ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ వైసీపీ బీఆర్ఎస్ కలిసి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. రాజ్యసభ ఆన్ రికార్డ్ గా విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలు దీనికి సాక్ష్యం అని అన్నారు సిబిఐ విజయసాయిరెడ్డి వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు సుజాత. కాంగ్రెస్ ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వము అని ఎవరిని కుట్రలు చేసినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని పడగొట్టలేరని సుజాత చెప్పారు

Read more RELATED
Recommended to you

Exit mobile version