హెడ్ కానిస్టేబుల్ పై దిశ పీఎస్ లో కేసు నమోదు..!

-

మహిళలకు రక్షణ కోసం ఏర్పాటు చేసిన దిశ పీ ఎస్ లో  ఓ పోలీస్ అధికారిపై పైనే లైంగిక వేధింపుల కేసు నమోదు అయ్యింది. ఈ ఘటన ఏలూరు లో చోటు చేసుకుంది. ఏలూరు దిశ పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్న రంగా నాయక్ పై లైంగిక దాడి కేసు నమోదు అయ్యింది. ధర్మాజీ గూడెం పీఎస్ లో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తున్న రంగనాయక్ పై ఓ మహిళ ఫిర్యాదు చేసింది. తనపై రంగనాయక్ అత్యాచారం చేయటంతో పాటు డబ్బులు తీసుకున్నారని బాధితురాలు ఫిర్యాదు లో పేర్కొంది.

Disha Police station

డబ్బు తిరిగి ఇవ్వమంటే తన వ్యక్తిగత ఫోటోలను వాట్సప్ గ్రూపులో పోస్ట్ చేశారంటూ బాధితురాలు ఆరోపించింది. బాధితురాలు మృతి చెందిన ఎ.ఆర్ కానిస్టేబుల్ భార్య గా సమాచారం. బాధితురాలి ఫిర్యాదు మేరకు హెడ్ కానిస్టేబుల్ తో పాటు అతని కుటుంబ సభ్యులపైనా కేసు నమోదు అయ్యింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఏపిలో వరుస ఘటనల నేపథ్యం లో సర్కార్ పై విమర్శలు వస్తున్నాయి. ఇక ఇప్పుడు పోలీసు పై ఆరోపణలు రావడం హాట్ టాపిక్ గా మారింది.

Read more RELATED
Recommended to you

Latest news