మంత్రి మ‌ల్లారెడ్డిపై క‌షాయిగూడ పీఎస్ లో ఫిర్యాదు..!

-

మంత్రి మ‌ల్లారెడ్డి మ‌రియు కాంగ్రెస్ పీసీసీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి మ‌ధ్య వార్ కొన‌సాగుతూనే ఉంది. ఒక‌రిపై మ‌రొక‌రు విమ‌ర్ష‌లు కురిపించుకుంటున్నారు. ఇక కాంగ్రెస్ ఇత‌ర నాయ‌కులు మ‌ల్లారెడ్డిపై మండిప‌డుతుండ‌గా టీఆర్ఎస్ నాయకులు రేవంత్ రెడ్డిపై ఆరోప‌ణ‌లు చేస్తున్నారు. మ‌రోవైపు మ‌ల్లారెడ్డి భూ అక్ర‌మాల‌కు పాల్ప‌డ్డార‌ని కూడా రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. ఇక తాజాగా మంత్రి మ‌ల్లారెడ్డిపై కాంగ్రెస్ నాయ‌కులు క‌షాయిగూడ్ పోలీస్ స్టేష‌న్ లో ఫిర్యాదు చేశారు.

మ‌ల్లారెడ్డి వ్యాఖ్య‌లు వంశ‌రాజ్ ల మ‌నోభావాలు దెబ్బ‌తీసేలా ఉన్నాయ‌ని ఫిర్యాదు లో పేర్కొన్నారు. మ‌ల్లారెడ్డిపై చ‌ట్ట‌ప‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు. డీసీసీ ఉమ్మ‌డి రంగారెడ్డి జిల్లా కార్య‌ద‌ర్శి బొజ్జా రాఘ‌వ‌రెడ్డి, తెలంగాణ యూత్ కాంగ్రెస్ సెక్ర‌ట‌రీ టిల్లు యాద‌వ్, తోట‌కూర్ శ్రీకాంత్ తదిత‌రులు పాల్గొన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version