BREAKING : మరో వివాదంలో మంత్రి పువ్వాడ అజయ్.. కేసు నమోదు !

-

తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ మరో వివాదంలో చిక్కుకున్నారు. విద్యార్థులను బెదిరించి వారికి వచ్చేటువంటి స్టైఫండ్ లాక్కున్నారని దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఖమ్మంలో పువ్వాడ అజయ్ కుమార్ కు చెందిన… మమత మెడికల్ కాలేజీ యాజమాన్యం అక్రమాలకు పాల్పడుతోందని వారు ఆరోపిస్తున్నారు.

మమత మెడికల్ అలాగే డెంటల్ కాలేజీ యాజమాన్యం పీజీ విద్యార్థుల స్టైఫండ్ నొక్కేస్తున్నారు దళిత సంఘాలు తాజాగా ఆరోపణలు చేస్తున్నాయి. ఎదురుతిరిగితే ఫెయిల్ చేస్తామని బెదిరిస్తున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశాయి దళిత సంఘాలు.

ఈ వ్యవహారంపై జాతీయ ఎస్సీ కమిషన్ కు రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేశారు. దళితుల నోటికాడి కూడు కూడా లాక్కున్నారని..అజయ్ కుమార్ ను మంత్రి పదవి నుంచి తీసేయాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా బిజెపి కార్యకర్త సాయి గణేష్ ఆత్మహత్య కేసులో పువ్వాడ అజయ్ కుమార్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Exit mobile version