బ్రేక్ : ఉద్రిక్త‌త‌లో కాళ‌హ‌స్తి లోకేశ్ ఖండ‌న

-

శ్రీ‌కాళ‌హ‌స్తిలో ఉద్రిక్త‌త‌త‌లు చోటుచేసుకున్నాయి. వైసీపీ వ‌ర్గాల‌కూ, టీడీపీ వ‌ర్గాల‌కూ ఘ‌ర్ష‌ణ నెల‌కొంది అని వార్త‌లు వ‌స్తున్నాయి. తీవ్ర ఉత్కంఠ నేప‌థ్యంలో ఇరు వ‌ర్గాల మ‌ధ్య పోరుతో సీమ అట్టుడికేలానే ఉంది. ఈ ఘ‌ట‌న‌పై లోకేశ్ ఏమ‌న్నాంటే..

“శ్రీకాళహస్తి పాల సొసైటీ ఎన్నికల్లో నామినేషన్ కు వెళుతున్న టిడిపి నేతలపై దాడిని ఖండిస్తున్నాను. నామినేషన్ కు వెళుతున్న రాష్ట్ర పార్టీ కార్యదర్శి చలపతి నాయుడు పై వైసిపి గూండాలు దాడిచెయ్యడం, కారు ధ్వంసం చెయ్యడం హేయమైన చర్య. ఎన్నికలు అంటే వైసిపి ఎందుకు భయపడుతుంది? నామినేషన్ పత్రాలు ఎత్తుకు పోతుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? దాడులు చేస్తున్న వైసిపి నేతలను కట్టడి చెయ్యలేని పోలీసులు.. నామినేషన్ కు వెళుతున్న టిడిపి నేతలను అరెస్టులు చెయ్యడం, అడ్డుకోవడం సిగ్గుచేటు.”

Read more RELATED
Recommended to you

Exit mobile version