డ‌ర్టీ హ‌రి మూవీ మేక‌ర్ల‌కు షాక్‌.. మ‌హిళ‌ల‌ను అవ‌మానించార‌ని కేసు న‌మోదు..

-

డ‌ర్టీ హ‌రి మూవీ మేక‌ర్ల‌కు షాక్ త‌గిలింది. జూబ్లీహిల్స్ పోలీసులు చిత్ర నిర్మాత‌ల‌పై కేసు న‌మోదు చేశారు. డ‌ర్టీ హ‌రి మూవీకి చెందిన ఓ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది. అందులో అర్ధ‌న‌గ్నంగా ఉన్న యువ‌తి, యువ‌కుడు చేతిలో సిగ‌రెట్ల‌ను ప‌ట్టుకుని వెన్ను చూపిస్తూ నిల‌బ‌డ‌తారు. ఆ పోస్ట‌ర్‌ను న‌గ‌రంలోని వెంక‌ట‌గిరి ప్రాంతంలో మెట్రో పిల్ల‌ర్ల‌పై అతికించారు. అయితే మ‌హిళ‌ల‌ను అవ‌మానించేవిగా ఆ పోస్ట‌ర్లు ఉన్నాయ‌ని చెబుతూ జూబ్లీహిల్స్ పోలీసులు సుమోటోగా తీసుకుని చిత్ర నిర్మాత‌ల‌పై కేసు న‌మోదు చేశారు.

case registered on dirty hari movie makers

ఇండియ‌న్ పీన‌ల్ కోడ్‌లోని 292 సెక్ష‌న్ ప్ర‌కారం డ‌ర్టీ హ‌రి మూవీ మేక‌ర్ల‌పై పోలీసులు కేసు న‌మోదు చేశారు. స‌ద‌రు సెక్ష‌న్ ప్ర‌కారం బుక్‌, పాంఫ్లెట్‌, పేప‌ర్, రైటింగ్‌, పెయింటింగ్‌, ఇత‌ర ఏ వ‌స్తువుపైనైనా, ఎలాగైనా స‌రే మ‌హిళ‌ల‌ను అవ‌మానించే విధంగా చిత్రాల‌ను ప్ర‌ద‌ర్శించ‌డం నేర‌మ‌ని పోలీసులు తెలిపారు. అందుక‌నే కేసు న‌మోదు చేశామ‌ని స్ప‌ష్టం చేశారు.

కాగా డిసెంబ‌ర్ 18న డ‌ర్టీ హ‌రి మూవీ విడుద‌ల కానుంది. అందులో భాగంగానే చిత్ర యూనిట్ పోస్ట‌ర్ల‌ను అతికించింది. ఇక ఈ మూవీలో శ్రావ‌ణ్ రెడ్డి, రుహానీ శ‌ర్మ‌, సిమ్ర‌త్ కౌర్‌లు న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత ఎంఎస్ రాజు ఈ మూవీకి ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఎస్‌పీజే క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై గూడూరు శివ రామ‌, గూడూరు స‌తీష్ బాబు, గూడూరు సాయి పునీత్‌లు ఈ చిత్రాన్ని నిర్మించారు.

Read more RELATED
Recommended to you

Latest news