బ్రేకింగ్ : పాస్టర్ ప్రవీణ్ చక్రవర్తి ఇంటి మీద సీబీఐ దాడులు 

-

ఏపీలో ఆలయాలపై దాడుల అంశం రాజకీయ దుమారం రేగుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి తరుణంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా గతంలో వ్యాఖ్యలు చేసిన ఓ వ్యక్తిని పోలీసులు కొన్ని రోజుల క్రితం అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలు ఫేక్ అంటూ ప్రచారం చేసిన కాకినాడకు చెందిన పాస్టర్ ప్రవీణ్‌ చక్రవర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. దేవుళ్ల విగ్రహాలను తాను ధ్వంసం చేశానని.. ధ్వంసం చేయించానని బెంగళూరు గాసిప్ అనే యూట్యూబ్ ఛానల్‌లో ప్రవీణ్ చేసిన పోస్టు వైరల్ అయ్యింది.

 

ఆయన మాట్లాడిన మాటలు ఎప్పటివో అయినా సరే ఇప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా ఉండడంతో ఆయనని అరెస్ట్ చేశారు. అయితే కాకినాడలో ఉన్న ఆయన ఇంటి మీద పోలీసులు, సీబీఐ అధికారులతో కలిసి దాడులు చేసినట్టు చెబుతున్నారు. అయితే సీఐడీ ఆయనని అరెస్ట్ చేయగా సీబీఐ అధికారులు కూడా దాడి చేయడం సంచలనంగా మారింది.

Read more RELATED
Recommended to you

Exit mobile version