ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు చంద్రబాబు నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు

-

గాన గంధర్వుడు ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం అంత్యక్రియలకు తెలుగు రాష్ట్రాల ప్రముఖులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ సిఎం వైఎస్ జగన్, తెలంగాణా సిఎం కేసీఆర్ తో పాటుగా కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక సిఎం యడ్యురప్ప హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు ముహ్యమంత్రి పళని స్వామి కూడా రానున్నారు అని తెలుస్తుంది. అలాగే ప్రముఖ గాయకుడు జేసు దాస్ కూడా వచ్చే అవకాశం ఉంది.

ఇక ఏపీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, మాజీ సిఎం కిరణ్ కుమార్ రెడ్డి హాజరు కానున్నారు. ఇక వైసీపీ ఎంపీలు కూడా ముగ్గురు హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. కేంద్ర జలవనరుల శాఖా మంత్రి, రక్షణ శాఖా మంత్రి హాజరు కానున్నారు. కేరళ సిఎం పినరాయి విజయన్ సహా పలువురు బాలీవుడ్ హీరోలు కూడా రానున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news