చైతన్య-శోభిత విడిపోతారు.. వేణు స్వామి సంచలన కామెంట్స్

-

నాగచైతన్య-శోభిత వైవాహిక జీవితం పై వేణు స్వామి సంచలన కామెంట్స్ చేశారు. ముఖ్యంగా ఇవాళ జరిగిన ముహుర్తం.. ఇవాళ 9గంటల 2 నిమిషాలకు ఉత్తర నక్షత్రంలో ఉంది.  ఉత్తర నక్షత్రం, కన్య లగ్నం అయింది. జనరల్ వైవాహిక జీవితానికి సంబంధించిన కడప్త స్థానంలో రాహువు ఉన్నారు. వైవాహిక జీవితంలో పిల్లలు కాకపోవడం, విడిపోవడం, గొడవలు జరగడం వంటివి అన్నీ కూడా కడప్త స్థానం వల్ల ఏర్పడుతాయని వేణు స్వామి తెలిపారు.

అలాగే 12వ స్థానంలో శుక్రుడు, గురుడు ఉన్నారు. ఒక్కసారి ఆలోచిస్తే.. అన్నింటికంటే ముఖ్యంగా శని దృష్టి 12వ స్థానంలో ఉంది. శాస్త్రం ప్రకారం.. ఈ ముహుర్తం నిషేదం అని చెబుతారు. మరీ ఎందుకు అండీ.. వీరు ఈ ముముర్తానికి పెళ్లి చేసుకున్నారంటే..? నాగార్జున గారు 888 అనే ముహుర్తాన్ని వాళ్లు నిర్వహించుకోవడం జరిగింది. 8వ  తేదీ, 8వ నెల, 2024 సంవత్సరం అంటే టోటల్ 8 అనే ఉద్దేశంతో ఇవాళ ముహుర్తం ఖరారు చేసుకున్నారు. ఇవాళ నిశ్చితార్థానికి పనికిరాని ముహుర్తం పనికి రాదు అని చెప్పారు. నాగచైతన్య-శోబిత మరో స్త్రీ వల్ల 2027 తరువాత విడిపోతారని ఆస్ట్రాలజిస్ట్ వేణు స్వామి జోస్యం చెప్పారు. మరోవైపు శుభమా అని ఆ జంట ఎంగేజ్ మెంట్ చేసుకుంటే ఇలాంటి అశుభ మాటలు ఏంటని వేణుస్వామి పై మండిపడుతున్నారు నెటిజన్లు.

Read more RELATED
Recommended to you

Exit mobile version