చంద్రబాబు: హైదరాబాద్ వెలిగిపోతుంటే, అమరావతి వెలవెలబోతోంది..!

-

వైకాపా ప్రభుత్వ పాలనలో ఏపీ 30 ఏళ్లు వెనక్కి వెళ్ళిపోయిందని మళ్లీ కోల్కోలేని విధంగా రాష్ట్రాన్ని జగన్ దెబ్బతీశారని అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. మన రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలందరూ కూడా కదిలి రావాలని అన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరులో నిర్వహించిన రా.. కదలిరా బహిరంగ సభలో చంద్రబాబు నాయుడు మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు ఓ పక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే మరోపక్క అమరావతి వెలవెలబోతుందని అన్నారు. అయితే ఇందుకు కారణం జగన్ రివర్స్ పాలన అని చెప్పారు.

ఒక వ్యక్తి కారణంగా రాష్ట్రం ఒక తరం ఇంతగా నష్టపోయిన పరిస్థితి ప్రపంచంలో ఎక్కడా లేదని అన్నారు. అసమర్ధుడు అధికారంలోకి వస్తే కొంత దాకా నష్టం కలుగుతుంది దుర్మార్గుడి పాలనలో రాష్ట్రంలో తిరిగి కోల్కోలేని విధంగా దెబ్బతింది అని చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ రాష్ట్రంలో నాతో సహా అందరూ బాధితులే అని చెప్పారు ప్రజాస్వామ్యంలో నిద్రలేని రాత్రులు గడిపామని అరాచక పాలనకు చరమగీతం పాడాలని కోరుతున్నానని చంద్రబాబు నాయుడు చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news