ఎన్టీఆర్ భవన్‌లో చంద్రబాబు, నారాలోకేశ్.. అంతా పసుపుమయం!

-

తెలుగుదేశం పార్టీని స్థాపించి నేటితో 43 సంవత్సరాలు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో ఘనంగా టీడీపీ 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను తెలుగుతమ్ముళ్లు నిర్వహించారు. ఈ వేడుకలకు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ మంత్రి నారాలోకేశ్ సైతం హాజరయ్యారు.

వారి వెంట టీడీపీ నేతలు పెద్దఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడు పార్టీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. చంద్రబాబు అనంతరం నారాలోకేష్, టీడీపీ నేతలు సైతం ఎన్టీఆర్‌కు నివాళ్లు అర్పించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version