నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో పర్యటన…విద్యా సంస్థలకు సెలవు !

-

నేడు రెండో రోజు చంద్రబాబు కుప్పంలో పర్యటించనున్నారు. అయితే… చంద్రబాబు నాయుడు కుప్పం టూర్ ను అడ్డుకోవాలని భావిస్తోంది కుప్పం వైసిపి పార్టీ. నిన్నటి రామ కుప్పంలో జరిగిన ఘటనలకు నిరసనగా బాబు టూర్ లో నిరసన, ర్యాలి చేపట్టే ఆలోచనలో ఉంది వైసిపి. కుప్పం నియోజకవర్గంలోని ప్రతి పంచాయతీ నుంచి వైసిపి కార్యకర్తలు ఉదయం కల్లా పార్టీ ఆఫీస్ కి రావాలంటూ వాట్సప్ సందేశాలు పంపారు.

వైసిపి పిలుపుకు ప్రతిగా జిల్లా టిడిపి సైతం చలో కుప్పంకు పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న టిడిపి శ్రేణుల ఉదయం ఎనిమిది గంటలకు ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ కు రావాలని వాట్సప్ సందేశాలు పంపారు. కుప్పంలోని ప్రైవేటు విద్యా సంస్థలకు సెలవు ఇవ్వాలి పిలుపు ఇచ్చింది వైసిపి పార్టీ. రెండు పార్టీ సవాళ్ళ నేపధ్యంలో కుప్పం అత్యంత భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ఇక ఇవాళ ఎలాంటి సంఘటనలు జరుగుతాయో చూడాలి.

Read more RELATED
Recommended to you

Exit mobile version