హీరోయిన్ త్రిష రాజకీయ ఎంట్రీ పై క్లారిటీ ఇచ్చిన త్రిష తల్లి..!!

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ముద్దుగుమ్మ ఎన్నో సినిమాలలో నటించి మంచి బ్లాక్ బస్టర్ విజయాలను కూడా అందుకుంది. అయితే ఈమధ్య తెలుగులో సినిమాలలో నటించకపోయిన ఈమెకు మాత్రం అభిమానులు ఉన్నారని చెప్పవచ్చు. త్రిష హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి ఇప్పటికి 23 సంవత్సరాలు పైనే అవుతోంది.అయినప్పటికీ కూడా తన అందం అభినయంతో బాగా ఆకట్టుకుంటూ ఉన్నది ఈ ముద్దుగుమ్మ. అయితే తాజాగా త్రిష రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది అనే ఒక వార్త సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. ఈ విషయంపై తన తల్లి క్లారిటీ ఇవ్వడం జరిగింది వాటి గురించి చూద్దాం.ఇక హీరోయిన్ త్రిష సినిమాలకు పుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి కాంగ్రెస్ పార్టీ ద్వారా ఈమె ఎంట్రీ ఇవ్వబోతోంది అనే వార్తలు వినిపించాయి.. అయితే త్రిష తల్లి మాత్రం తన కూతురు పొలిటికల్ ఎంట్రీ పై ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. ఇక త్రిష తల్లి పేరు ఉమా కృష్ణన్ .. ఈమె మాట్లాడుతూ ప్రస్తుతం తన కూతురు త్రిష ఫోకస్ మొత్తం ఎక్కువగా సినిమాలపైనే ఉందని రాజకీయాలలోకి వెళ్లి ఆలోచన అసలు లేదని తెలియజేసింది. అంతేకాకుండా తమిళంతో పాటు ఇతర భాషలలో సైతం నటించేందుకు ఆమె సిద్ధంగా ఉందని తెలియజేయడం జరిగింది.ఇక అంతే కాకుండా త్రిష కూడా తన రాజకీయ వార్తలను ఖండించినట్లుగా సమాచారం. ఇలాంటి వార్తలు ఎలా వస్తాయో ఎలా పుట్టుకొస్తాయి తనకి అసలు అర్థం కాలేదని తెలియజేసినట్లు సమాచారం. తనకు ఇప్పటివరకు రాజకీయాలలో రావాలనే ఆలోచన అసలు లేదని కూడా తెలియజేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంపై అధికారికంగా మాత్రం త్రిష స్పందించలేదు.. దీంతో త్రిష అభిమానులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. ఇక తమ హీరోయిన్ ని వెండితెర పైన ఇంకా కొన్ని సంవత్సరాలు చూడవచ్చని చాలా సంబరపడుతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version