మతం విషయంలో బాబు & కో బూమరాంగ్ ఇది!!

-

గడిచిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలు విడుదలయినప్పటినుంచి మొదలు… టీడీపీ అధినేత చంద్రబాబుకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నారు ఏపీ ముఖ్యమంత్రి జగన్. కరోనా వచ్చింది కదా.. దాన్ని అడ్డుపెట్టుకుని అయినా జగన్ ను ఇరకాటంలో పెడదామని బాబు & కో ప్రయత్నిద్దామనుకునేలోపు… ఆ కరోనా సమయంలో కూడా జగన్ చేసిన సంక్షేమ కార్యక్రమాలు జనంలో హీరోని చేసేసాయి. దీంతో బాబు పాచికలు కరోనా కూడా పారించలేకపోయాయి! దీంతో జగన్ మతంపై పడ్డారు బాబు & కో!

అవును… రాజకీయంగా జగన్ ని ఎదుర్కోవడం చేతకాని చేవలేని చంద్రబాబు & కో ఆఖరుకు జగన్ మతం మీద పడ్డారు. ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న విషయం మరిచారు.. ఇంకా బాబే ముఖ్యమంత్రి అన్న భ్రమలో మాట్లాడుతున్నారు. జనం లైట్ తీసుకున్నారనుకోండి అదివేరే విషయం! ఇక పసుపు మీడియా అయితే… మొత్తం గుడ్డలు చించేసుకుంది!! పగలు రాత్రి పడుకోవడం వల్ల వచ్చిన ప్రతి కలనీ.. ఒక ప్రోగ్రాంగా చేయడం మొదలుపెట్టింది!!

వీరుసరిపోరన్నట్లుగా… పరిపూర్ణానంద స్వామి అనబడే ఒక పగటి వేషగాడు వైఎస్ రాజశేఖరరెడ్డి, ఇందిరాగాంధీ మరణాలు ఉదాహరణగా చూపిస్తూ జగన్ కూడా అలాగే బూడిదైపోతాడని పిచ్చిపట్టినోడిలా శాపనార్ధాలు పెట్టాడు. ఫలితంగా హిందువుల మనోభావలు దెబ్బతీశాడు.. వెంకటేశ్వర స్వామి అలాంటివారా అనే అనుమానాలు కలిగించారు!! సన్యాసుల ముసుగులో సన్నాసిలా బ్రతికేస్తున్న ఈ మూర్ఖుడు కూడా బాబు తొత్తేనా అన్న అనుమానాలు కలిగించేలా!!

-CH Raja

Read more RELATED
Recommended to you

Exit mobile version