జగన్ రెడ్డీ…మాచర్ల మంటలు నిన్నూ దహించడం ఖాయం – చంద్రబాబు

-

జగన్ రెడ్డీ…మాచర్ల మంటలు నిన్నూ దహించడం ఖాయమని.. ఇది గుర్తించుకోవాలని టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నిన్నటి నుంచి మాచర్లలో టీడీపీ, వైసీపీ మధ్య గొడవలు జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ సంఘటనపై చంద్రబాబు స్పందించారు.

మాచర్లలో టీడీపీ శ్రేణులపై వైసీపీ గూండాల దాడులు, పార్టీ నేతల ఇళ్లు, పార్టీ కార్యాలయాలకు నిప్పు పెట్టిన ఘటనలను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. అధికార పార్టీ రౌడీయిజానికి పోలీసులు కొమ్ము కాయడం ఇంకా దారుణమన్నారు చంద్రబాబు.

వైసీపీ గూండాలు అరాచకాలు చేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు ? అని నిలదీశారు. ఎస్పీ, డీజీపీ ఎక్కడ ఉన్నారు? ఎందుకు స్పందించడం లేదు? రాష్ట్రంలో దిగజారిన శాంతి భద్రతల పరిస్థితికి ఇది అద్దం పడుతుంది. ఇలాంటి చర్యలకు వైసీపీ నేతలు ఇంతకు ఇంత మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version