నేడు గుంటూరులో పర్యటించనున్న చంద్రబాబు

-

ఉమ్మడి గుంటూరు జిల్లాలో టీడీపీ అధినేత చంద్రబాబు నేడు పర్యటించనున్నారు. నిన్న పొన్నూరులో జరిగే ‘ఇదేం ఖర్మ.. మన రాష్ట్రానికి’ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు.. రోడ్‌షోలు, బహిరంగ సభలో చంద్రబాబు ప్రసంగించారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు గుంటూరు పర్యటనకు సంబంధించి జిల్లా పార్టీ నేతలు ఇప్పటికే సన్నాహక సమావేశాలు నిర్వహించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు తెనాలి శ్రావణ్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రజల్లో చైతన్యం నింపేందుకు చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారని టీడీపీ నేతలు చెబుతున్నారు.

అధినేత పాల్గొనే కార్యక్రమాలను జయప్రదం చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందని.. జిల్లా పార్టీ నేతలు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రానికి పట్టిన ఖర్మ పోవాలంటే.. ప్రజలందరూ చంద్రబాబుకు మద్దతు పలకాలని కోరుతున్నారు. ఈనెల 8న పొన్నూరు, 9న చీరాల, 10న బాపట్ల నియోజకవర్గాల్లో చంద్రబాబు పర్యటన ఉండనుంది. దీంతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల ఇన్‌ఛార్జులు చంద్రబాబు పర్యటనను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని విజయవంతం చేసేలా ఏర్పాట్లు చేశారు. బైక్ ర్యాలీలు, రోడ్ షో, బహిరంగ సభలకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి.

Read more RELATED
Recommended to you

Exit mobile version