ట్రైలర్ టాక్: కార్తికేయ కామెడీ “చావు కబురు చల్లగా”

-

ఆర్ ఎక్స్ 100 సినిమాతో తిరుగులేని విజయాన్ని అందుకున్న కార్తికేయ గుమ్మకొండ, ఆ తర్వాత సరైన హిట్ అందుకోలేదు. నాని నటించిన గ్యాంగ్ లీడర్ సినిమాలో విలన్ గా కనిపించిన పెద్దగా మెప్పించలేకపోయాడు. తాజాగా కార్తికేయ హీరోగా చావు కబురు చల్లగా సినిమా తెరకెక్కింది. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో రూపొందిన ఈ సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది. ప్రస్తుతం ప్రమోషన్లలో భాగంగా ట్రైలర్ ని వదిలారు. అంతిమ యాత్ర వాహనం నడిపే బస్తీ బాలరాజు ప్రేమలో పడితే ఎలా ఉంటుందన్నదే కథగా అర్థం అవుతుంది.

చావింటికి వచ్చి ప్రేమ ప్రపోజ్ చేయడమే కొత్తగా ఉంది. అందుకు కార్తికేయ ఇచ్చిన సమాధానం ఇంకా కొత్తగా కనిపించింది. ట్రైలర్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. లావణ్య త్రిపాఠి, కార్తికేయ మధ్య వచ్చిన సీన్లు సినిమాపై ఆసక్తిని కలిగిస్తున్నాయి. ట్రైలర్ పూర్తిగా చూస్తే పెద్దగా యాక్షన్ సన్నివేశాలు లేనట్టుగా తోస్తుంది. సినిమా మొత్తం కామెడీతో నింపేసినట్టుగా, కమెడియన్లు లేకుండా కార్తికేయే కామెడీ చేసినట్టుగా ఉంది. ట్రైలర్ ప్రకారం ఈ సినిమాలో కార్తికేయ నటన బాగుందనిపిస్తుంది. బన్నీ వాసు నిర్మాతగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని కౌషిక్ పెగల్లపాటి దర్శకత్వం వహించాడు. మార్చి 19వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.

Read more RELATED
Recommended to you

Latest news