33 ఏళ్ళ నుంచి ఆహరం లేకుండా టీతో మాత్రమే బతుకుతున్న మహిళ… డాక్టర్లకు మైండ్ పోయింది…!

-

ఒక్క రోజు అన్నం తినకపోతే ఏమవుతుంది…? పేగులు మెలిపడిపోయి పొట్టలో ఎలుకలు పరిగెడుతూ ఉంటాయి. రోజు సంగతి ఎందుకు ఒక్క పూట ఆహరం తినకపోతే పరిస్థితి ఎలా ఉంటుందో చెప్పాల్సిన పని లేదు. అలాంటిది ఒక మహిళ దాదాపు 35 ఏళ్ళుగా ఆహారమే తీసుకోవడం లేదు. కేవలం… టీ తో మాత్రమె ఆమె బ్రతుకుతుంది. అవును నిజం ఆమె టీతోనే బ్రతుకుతుంది. ఎక్కడో కాదు చత్తీస్ఘడ్ రాష్ట్రంలో… కొరియా జిల్లాలోని బరదియా గ్రామానికి చెందిన 44 ఏళ్ల పిల్లిదేవి తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పటి నుండి తినడం లేదు.

పాలతో తయారు అయ్యే టీ కాకుండా బ్లాక్ టీ తాగుతూ జీవితాన్ని గడుపుతుంది. కాని ఆమెకు ఏ చిన్న జబ్బు లేదు. ఆమె పూర్తి ఆరోగ్యంతో ఉన్నారు. దీనిపై ఆమె తండ్రిని మీడియా ప్రశ్నించింది. తన కూతురు ఆరవ తరగతి చదువుతున్న సమయంలో స్కూల్‌ తరపున జిల్లా స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొని తిరిగి వచ్చిన తర్వాత తాను భోజనం తినమని చెప్పానని తాను అప్పుడు వద్దని చెప్పిందని… మరుసటి రోజు తింటుంది అని చూసామని… కాని టీ తాగి రెండు బిస్కట్లు మాత్రమె ఆహారంగా తీసుకుందని ఆయన వివరించారు.

అలా ఎలా బ్రతుకుతుందో తమకు ఏ మాత్రం అర్ధం కాలేదని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మొదట్లో బిస్కట్లు తిన్న తన కుమార్తె ఇప్పుడు కేవలం టీ తో మాత్రమె జీవితం గడుపుతుందని ఆయన వివరించారు. మొదట్లో కనీసం నీళ్లు కూడా తాగేది కాదని, ఇప్పుడు నీళ్ళు టీ తాగుతుందని ఆయన చెప్పుకొచ్చారు. అయితే ఆమె అలా ఎందుకు చేస్తుందనే విషయాన్ని మాత్రం ఎవరికి చెప్పడం లేదట. దీనిపై వైద్యులు ఆరా తీసే ప్రయత్నం చేయగా… వాళ్లకు కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి… ఆమెకు ఆహారం అవసరం లేదని, ఆమె టీ ఇష్టంతో తాగుతుందని వారు గమనించారు.

Read more RELATED
Recommended to you

Latest news