వాడు పోరంబోకు అంటూ సంచలన కామెంట్లు చేసిన చిరంజీవి..!

-

చిరంజీవి.. డైరెక్టర్ బాబీ దర్శకత్వంలో తాజాగా చిత్రీకరించిన చిత్రం వాల్తేరు వీరయ్య. ఈ సినిమా జనవరి 13వ తేదీన థియేటర్లలో విడుదల కానున్న నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్ లో శరవేగంగా పాల్గొంటున్నారు చిరంజీవి. ఈ క్రమంలోనే పలు మీడియా ఛానల్స్ కి వెళ్తున్న ఈయన.. పలు ఇంటర్వ్యూలో పాత విషయాలను కూడా బయటపెడుతూ మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాడు. తాజాగా మెగాస్టార్ ఒక ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. అప్పట్లో సంచలనంగా మారిన హీరో సుమన్ బ్లూ ఫిలిం కేసు పై క్లారిటీ ఇచ్చారు.

తాజాగా ఇంటర్వ్యూలో భాగంగా సదరు జర్నలిస్టు సుమన్ బ్లూ ఫిలిం కేసు గురించి ప్రస్తావించగా చిరంజీవి స్పందిస్తూ..” మేమిద్దరం మంచి స్నేహితులం. మధ్యలో ఎవడో ఒక పోరంబోకు జర్నలిస్టు.. అది వక్రీకరించి రాశాడు. ఇప్పటికే కొన్ని వందలసార్లు సుమన్ దీనిపై స్పందించాడు. మా ఇద్దరి మధ్య ఎలాంటి శత్రుత్వం లేదు. ఇలాంటివి ఎప్పుడూ జరగలేదు అంటూ తొలిసారి పెదవి విప్పారు. అసలు ఆ వార్తలు పుట్టించినోడిది శాడిజం అనాలి. ఇప్పటికీ సుమన్ కి నేను విషెస్ చెబుతూ ఉంటాను. 80 వ దశకం యూనియన్ లో కూడా మేము కలవబోతున్నాము.. మాట్లాడుకుంటాం.. నవ్వుకుంటాం..

ఏ వాళ్లకు తృప్తి ఉండదా? ఏదో ఒక విషయంపై రచ్చ లేపుతూనే ఉంటారు. అసలు దీని గురించి మాట్లాడుకోవడమే చాలా సిగ్గుచేటు అంటూ చిరంజీవి మాట్లాడారు. ముఖ్యంగా ఏ తప్పు చేయకపోయినా ఇలాంటివి సృష్టించి పైశాచిక ఆనందం పొందే బ్యాచ్ ఒకటి ఉంటుంది. కానీ నేను ఎలాంటి తప్పులు చేయను.. నా నుంచి తప్పులు ఎవరూ పట్టలేదు. ఇలాంటి తప్పులు ఎప్పుడు వచ్చినా నన్ను ఇబ్బంది పెట్టవు అంటూ క్లారిటీ ఇచ్చారు. చిరంజీవి మొత్తానికైతే చాలా ఏళ్లుగా ఉన్న ఈ వివాదానికి చిరంజీవి తన మాటలతో ఫుల్ స్టాప్ పెట్టేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version