ఇది కదా పుత్రోత్సాహం.. చరణ్ తండ్రి కనుకే చిరు మీద ఫోకస్..!

-

మెగాస్టార్ చిరంజీవి అసలైన పుత్రోత్సాహాన్ని పొందారు. అసలు ఏం జరిగిందంటే.. నిన్న మెగాస్టార్ చిరంజీవి తన భార్య సురేఖ కొడుకు రాంచరణ్ తో పాటుగా అయోధ్య రామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి చిరంజీవి వెళ్లారు. తెలుగు రాష్ట్రాల నుండి ఆహ్వానం పొందిన వాళ్లలో చిరు కూడా ఒకరు. తెలుగు రాష్ట్రాల నుండి వెళ్లిన అతి కొద్ది మందిలో మెగా ఫ్యామిలీ నుండి ముగ్గురు ఉన్నారు. ఈ క్రమంలో అయోధ్య బాలరామని ప్రాణప్రతిష్ట సందర్భంగా ఒక నేషనల్ మీడియా కెమెరామెన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

అయోధ్య వెళ్లిన మెగాస్టార్ చిరంజీవి అక్కడ ఉన్న అనిల్ అంబానీ తో మాట్లాడుతున్నప్పుడు అక్కడ నేషనల్ మీడియా కెమెరాలు అన్ని చిరంజీవిని ఫోకస్ చేశాయి. ఎక్కువసేపు ఎందుకు అదే ఫ్రేమ్ పెట్టారు అని అధికారులు అడిగితే అక్కడ రామ్ చరణ్ ఉన్నారు. పక్కన ఉంది ఆయన తండ్రి. అందుకే ఫ్రేమ్ ఫోకస్ లో పెట్టామని కెమెరామెన్ చెప్పారు. నిజానికి మన దగ్గర చిరంజీవి ఫేమస్ కానీ పక్క రాష్ట్రాలలో రామ్ చరణ్ ని గుర్తుపడతారు. రామ్ చరణ్ తండ్రి అయిన అని నార్త్ వాళ్ళు మాట్లాడుకునే రేంజ్కి చరణ్ క్రేజ్ ఎగబాకడం ఇక్కడ గమనించాల్సినది.

Read more RELATED
Recommended to you

Latest news