క్రికెట్ అభిమానులకు పండుగే.. WPL షెడ్యూల్ వచ్చేసింది

-

క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మహిళల ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ షెడ్యూల్ వచ్చేసింది. డబ్ల్యూపీఎల్ 2024 టోర్నీ ఫిబ్రవరి 23 నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు మంగళవారం బీసీసీఐ అధికారిక ప్రకటన చేసింది. బెంగళూరు వేదికగా తొలి పోరులో డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్, రన్నరప్ ఢిల్లీ క్యాపిటల్స్ తలపడనున్నాయి. తొలి సీజన్ లో కేవలం ముంబైకే పరిమితమైన డబ్ల్యూపీఎల్ ఈ సారి రెండు నగరాల్లో జరుగనుంది.

ఈ సీజన్ లో మొదటి దశ మ్యాచ్ లు బెంగళూరులో.. రెండో దశ మ్యాచ్ లు ఢిల్లీలో జరుగనున్నాయి. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 04 వరకు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో మ్యాచ్ లు జరుగనున్నాయి. అనంతరం మార్చి 05 నుంచి మిగిలిన దశ మ్యాచ్ లు ఢిల్లీలో జరుగనున్నాయి. మార్చి 15న ఎలిమినేటర్ మ్యాచ్, మార్చి 17న ఫైనల్ మ్యాచ్ ఢిల్లీలో జరుగనున్నాయి. మొత్తం అన్ని మ్యాచ్ లు రాత్రి 7.30 గంటలకు ప్రారంభం అవుతాయి. భారత్ లో మహిళల క్రికెట్ ను అభివృద్ధి చేసేందుకు గత ఏడాది డబ్ల్యూపీఎల్ తొలి సీజన్ కి బీసీసీఐ శ్రీకారం చుట్టింది. 

Read more RELATED
Recommended to you

Latest news