దారుణం : మూఢనమ్మకాలతో ఇద్దరు కూతుళ్ళ దారుణ హత్య.. డంబెల్స్ తో మోది !

-

ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి, మూడ భక్తితో ఇద్దరు కుమార్తెలను తల్లిదండ్రులే కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు లోకి వెళితే మదనపల్లి శివాలయం కాలనీలో నివాసం ఉండే పురుషోత్తమ నాయుడు మదనపల్లి ఉమెన్స్ కాలేజీ వైస్ ప్రిన్సిపాల్ గా పని చేస్తున్నారు. భార్య పద్మజ ప్రశాంతి కాలనీ లోని ఒక ప్రైవేట్ స్కూల్లో కరస్పాండెంట్ గా పని చేస్తున్నారు. ఆయనకు ఇద్దరు కుమార్తెలు అలేఖ్య 27 సంవత్సరాలు సాయి దివ్య 22 సంవత్సరాలు వీరిద్దరూ కూడా ఉన్నత చదువులు చదివారు. అయితే వీరిద్దరినీ తల్లిదండ్రులే డంబెల్స్ తో కొట్టి నోట్లో రాగిచెంబు పెట్టి మరీ ప్రాణాలు తీశారు.

ఆధ్యాత్మిక మత్తులో మునిగిపోయిన తల్లిదండ్రులు పిల్లలు మళ్లీ బతికి వస్తారని వాళ్లని చంపామని చెబుతుండడం అందరిని కంటతడి పెట్టిస్తుంది. నిన్న ఆదివారం ఏకాదశి సందర్భంగా ఇంట్లో ప్రత్యేక పూజలు చేసి తల్లిదండ్రులు తమ పిల్లలను కొట్టి చంపేశారు. పిల్లల అరుపులతో చుట్టుపక్కల వాళ్లు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే ఇక్కడకు వచ్చి పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకోగా మా పిల్లలు మేము బతికించుకుంటాం, ఉదయానికి ఇద్దరూ లేచి వస్తారు ! ఈ ఒక్కరోజు సమయం ఇవ్వండి అని ఇద్దరూ పోలీసులు కోరారట. విస్తుపోయిన పోలీసులు ఇద్దరు మీద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news