జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట : అంబటి రాంబాబు

-

విద్యారంగంలో అనేక మార్పులు తీసుకురావాలని వైఎస్‌ జగన్‌ ప్రయత్నించారని.. కానీ సీఎం చంద్రబాబు తనకు అలవాటైన మోసాలను ప్రదర్శిస్తున్నారని మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఆయన గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ..రాష్ట్రంలో అక్షరాస్యత పెంపొందించడానికి ప్రతిపిల్లవాడు చదువుకోవాలనే ఉద్దేశంతో సంస్కరణలు తీసుకొచ్చారు. ఇప్పుడ ముఖ్యమంత్రి చంద్రబాబు ఎలాంటి జీవో ఇచ్చారో ప్రతిఒక్కరూ తెలుసుకోవాలి. కేవలం ప్రతి తల్లికి రూ. 15 వేలు మాత్రమే ఇస్తానని జీవో ఇచ్చారు. ఇది సూపర్ సిక్సా? లేక సూపర్‌ మోసమా?.ఇచ్చిన వాగ్దానాలను తుంగలోకి తొక్కిన మోసగాడు చంద్రబాబు నాయుడు అని విమర్శించారు. మోసం చేయటం చంద్రబాబుకు అలవాటు. వైఎస్‌ జగన్‌ అధికారంలో ఉంటే ఇప్పటికే అమ్మఒడి అందించేవారు అని అన్నారు.

 

నిరుద్యోగభృతి ఇస్తానన్న హామీని చంద్రబాబు నిలబెట్టుకోవాల్సిందే. జనాన్ని మోసం చేయటంలో సీఎం చంద్రబాబు దిట్ట అని మండిపడ్డారు. మోసాలు చేయటం అలవాటు పడిన చీటర్ చంద్రబాబు. చంద్రబాబుకు ఓట్లేసిన వారు ఆయన చేసిన మోసాలను గుర్తించాలి అని తెలిపారు. హామీలను అమలు చేయలేక వైఎస్‌ జగన్‌ను చంద్రబాబు దూషిస్తున్నారు. చంద్రబాబు నాయుడు చేసిన మోసాలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news