రైతులకు సీఎం చంద్రబాబు శుభవార్త.. మళ్లీ అమల్లోకి ఆ విధానం

-

రైతులకు తెలుగుదేశం పార్టీ చీఫ్, ముఖ్యమంత్రి చంద్రబాబు మరో శుభవార్త అందించారు.వ్యవసాయ, జలవనరుల శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు బుధవారం సమీక్ష నిర్వహించారు.ఈ సందర్భంగా ఖరీఫ్ సీజన్ పంటల ప్రణాళిక, సాగునీటి విడుదలపై 2 శాఖల మంత్రులు, సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భగా సీఎం మాట్లాడుతూ.. ఖరీఫ్ సీజన్‌లో రైతులకు సాగునీటి కొరత లేకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ప్రాజెక్టుల నిర్వహణను గాలికి వదిలేసిందని మండిపడ్డారు .వ్యవస్థలు అన్నీ మళ్లీ గాడిన పడాలని ఆయన సూచించారు.

 

ప్రభుత్వ సాయం, సబ్సిడీలతో రైతులకు సాగు ఖర్చు తగ్గించేలా చర్యలు తీసుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వం ఎత్తేసిన పాత పంటల బీమా విధానాన్ని మళ్లీ తీసుకొస్తామని చంద్రబాబు రైతులకు శుభవార్త చెప్పారు. కాగా, ప్రకృతి వైపరీత్యాలు, వర్షాలు, ఇతర కారణాల వల్ల పంట నష్టపోతే.. పంటల బీమా విధానం కింద రైతులకు ప్రభుత్వమే ఆర్ధిక సహయం అందిస్తోంది. ఈ విధానాన్నే మళ్లీ అమల్లోకి తీసుకొస్తామని తాజాగా చంద్రబాబు ప్రకటించారు. ముఖ్యమంత్రి నిర్ణయం పట్ల రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version