BREAKING : తెలుగు ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు : సీఎం జగన్‌

-

దీపావళి పండుగ సందర్భంగా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఇంటా ‘ఆనంద దీపావళి కావాలన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. చీకటిపై ‘వెలుగు’.. చెడుపై ‘మంచి’.. అజ్ఞానంపై ‘జ్ఞానం’.. దుష్ట శక్తులపై ‘దైవశక్తి’.. సాధించిన విజయాలకు ప్రతీకగా జరుపుకునే దీపావళి పండుగ ప్రజలందరి జీవితాల్లో ఆనంద కాంతులు నింపాలని ఆకాంక్షించారు సీఎం జగన్‌. ఈ పర్వదినం సందర్భంగా తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని, దివ్వెల వెలుగులలో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో విరాజిల్లాలని అభిలషించారు సీఎం జగన్‌.

ఇదిలా ఉంటే.. దీపావళి సందర్భంగా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు పోలీసులు. బాణాసంచా విక్రయ దుకాణాలకు అన్ని రకాల సేఫ్టీ నిబంధనలు పాటించాకే అనుమతులు మంజూరు చేశారు. అన్ని చోట్ల ఫైర్ సేఫ్టీ తప్పనిసరిగా తీసుకోవాలని పోలీసులు సూచించారు. తిరుపతి, విజయవాడ లాంటి ఘటనలు జరగకుండా చర్యలు చేపట్టారు. దీపావళి నాడు అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version