విశాఖ ఘటన పై సీఎం జగన్ ఆరా..!

-

విశాఖను వరుస ప్రమాదాలు చుట్టుముడుతున్న విషయం తెలిసిందే. మొన్నటికి మొన్న విశాఖ గ్యాస్ లీకేజీ ఘటన… ఆ తర్వాత పలు అగ్నిప్రమాదాలు… ఇటీవలే విశాఖకు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ ప్రమాదం. విశాఖ వాసులను వరుస ప్రమాదాలు భయాందోళనకు గురి చేస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ రోజు హిందుస్థాన్ షిప్ యార్డ్ లో భారీ క్రేన్ కుప్పకూలి 10 మంది కూలీలు అక్కడికక్కడే దుర్మరణం చెందిన విషాద ఘటన చోటుచేసుకుంది.

తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రమాదంపై ఆరా తీసినట్లు తెలుస్తోంది. జిల్లా కలెక్టర్ సహా విశాఖ నగర పోలీస్ కమిషనర్ మరికొంత మంది అధికారులను ఈ ఘటనపై ఆరాతీసి పలు వివరాలు తెలుసుకున్నారు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. అంతేకాకుండా తక్షణ చర్యలకు ఉపక్రమించాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు. మరోవైపు ఈ ఘటనపై స్పందించిన టిడిపి అధినేత ప్రతిపక్షనేత చంద్రబాబు నాయుడు.. షిప్ యార్డ్ లో ప్రమాదం జరగడం బాధాకరం అని… క్షతగాత్రులకు మెరుగైన వైద్య సహాయం అందించాలి అంటూ ప్రభుత్వాన్ని కోరారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version